‘మన ఫ్రెండ్స్ ఎదవలైతే.. మనం ఎదవలవుతాం..’ దుమ్ముదులిపిన రానా

2
హీరో దగ్గుబాటి రానా యాంకర్‌గా చేస్తున్న షో ‘నెం.1 యారి’. జెమినీ టీవీలో ప్రతి ఆదివారం ప్రసారమైన ఈ షో ఇప్పటికే రెండు సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే రానా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కొంతకాలం ఈ షోకు బ్రేక్ వచ్చింది. తాజాగా రానా మూడో సీజన్‌కు రెడీ అయ్యారు. త్వరలోనే ‘నెం.1 యారి సీజన్-3’ మొదలుకానుంది.
సీజన్-3కి సంబంధించిన ప్రోమో ఈ మధ్యే విడుదలైంది. ఈ ప్రోమోలో రానాతో పాటు మంచు లక్ష్మీ, నటుడు నవదీప్‌లు కూడా కనిపించారు. “మనమెవ్వరన్నది.. మన ఫ్రెండ్స్‌ని బట్టి తెలుస్తుంది. మన ఫ్రెండ్స్ ఎదవలైతే.. మనం ఎదవలవుతాం. మన ఫ్రెండ్స్ టాపర్ అయితే, మనం టాపర్ అవుతాం. మనం చిల్ అయిన ఫీల్ అయినా అన్నీ వీళ్ళతోనే.. ఇలాంటి ఫ్రెండ్‌షిప్‌ని షేర్ చేసుకునేందుకు ఈ సారి మరింత ఫన్‌తో, మరిన్ని స్టోరీలతో, మరింత మంది యారీలతో, మీ ముందుకు వస్తున్నా” అంటూ సీజన్ 3 కమింగ్ సూన్ అని రానా ప్రోమోలో చెప్పుకొచ్చాడు.
మొదటి రెండు సీజన్స్‌కు రానా ఒక్కరే ఈ షోకు హోస్ట్‌గా చేశారు. అయితే సీజన్-3 ప్రోమోలో మాత్రం మంచు లక్ష్మీ, నవదీప్‌లు కనిపించడంతో ఈ షోలో హోస్ట్‌గా చేస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleమంత్రి కేటీఆర్ ‘ఫామ్‌హౌస్’ కేంద్రంగా రేవంత్ రెడ్డి Vs బాల్క సుమన్
Next articleరేవంత్ రెడ్డి అరెస్ట్.. డ్రోన్‌ వాడకంపై సీరియస్ రియాక్షన్

2 COMMENTS

  1. I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here