బీటెక్ పరీక్షలను వాయిదా వేసే ఆలోచనేమీ లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలను కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరీక్షలు వాయిదా పడుతాయని వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు.
పరీక్షల నిర్వహణపై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలజీలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బీటెక్ విద్యార్థులు 40 వేల మంది మాత్రమే ఉన్నారని, కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు.
డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలను కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ చెప్పారు. అన్ని వర్సిటీల పరిధిలో 1.20 లక్షల మంది డిగ్రీ విద్యార్థులు ఉన్నారని, వారందరికీ భౌతిక దూరం, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Your article helped me a lot, is there any more related content? Thanks!